రచ్చ రచ్చగా కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశాలు

కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశంలో ఒకదాని తర్వత ఒకటిగా వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ నీలం తుపాను బాధితులకు, తెలంగాణ అమరవీరులకు సంతాపం తెలుపుతూ రెండు నిమిషాలు మౌనం పాటించాలని డిమాండ్ చేశారు. పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ తెలంగాణ అమరవీరులకు ఇప్పటికే సంతాపం ప్రకటించామని చెప్పారు. ఈ సమావేశంలో నీలం తుపాను బాధితులకు సంతాపం తెలుపుతూ మౌనం పాటించాలన్న పొన్నం సూచనకు బొత్స అంగీకారం తెలిపారు. అనంతరం ఒక నిమిషం మౌనం పాటించి నేతలు సదస్సులో పాల్గొన్నారు. కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశానికి పలువురు నేతలు గైర్హాజరయ్యారు. కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి, పురంధేశ్వరిలతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి కోమటిరెడ్డి సమావేశానికి హాజరుకాలేదు.