Site icon TeluguMirchi.com

దేశ అంతర్గత భద్రతపై సీఎంల సమావేశం !

pmదేశ అంతర్గత భద్రతపై రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఢిల్లీలో ప్రారంభమైంది. ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే, ఆర్థిక మంత్రి
చిదంబరం, రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. దేశ అంతర్గత భద్రతకు సంబంధించిన మొత్తం 12 అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇటీవల ఛత్తీస్ ఘడ్ లో చోటుచేసుకున్న నక్సల్ దాడి ఈ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి ఆంధ్రపదేశ్ నుంచి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, డీజీపీ దినేష్ రెడ్డి హాజరయ్యారు. కాగా, ఈ సమావేశానికి బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు జయలలిత లు దూరంగా ఉన్నారు.

Exit mobile version