తెలుగువారిని రక్షించండి..!

 

uttarakhand-floodsఉత్తరాఖండ్ రాష్ట్రంలో చిక్కుకుపోయిన తెలుగు వారిని తక్షణమే రక్షించి రాష్ట్రానికి తరలించాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్ది అధికారులను, మంత్రులను ఆదేశించారు. ఉత్తరాఖండ్ వరదలపై ఈరోజు ఉదయం సీఎం నిర్వహించారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులతో కిరణ్ ఫోన్ లో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఉత్తరాఖండ్ లో చిక్కుకున్న తెలుగువారిని తొందరగా తరిలించేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులకు సీఎం సూచించినట్లు సమాచారం. మరోవైపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.