Site icon TeluguMirchi.com

డెహ్రాడూన్ నుంచి రాష్ట్రానికి విమానం : సిఎం

kirankumarడెహ్రాడూన్ నుంచి నేరుగా రాష్ట్రానికి విమానం ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. జాతీయ విపత్తును రాజకీయం చేయడం సరికాదని కిరణ్ అన్నారు. ప్రతి ఒక్క తెలుగువారిని ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. అయితే, ఈరోజు ఉదయం ఢిల్లీ బయలుదేరి వెళ్లిన ముఖ్యమంత్రి నేరుగా ఏపీ భవన్ కు చేరుకున్నారు. కాగా, తెలంగాణ విషయంలో కేంద్రం తేల్చబోతుందన్న నేపథ్యంలో.. ముఖ్యమంత్రి అధిష్టాన పెద్దలతో సమావేశమయ్యే అవకాశాలున్నాయని సమాచారం.

Exit mobile version