Site icon TeluguMirchi.com

నాటకాలొద్దు.. మాట్లాడుకుందాం రండి !

CM-kiran-Kumar-Reddy-తెరాస ఎమ్మెల్యేలపై సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాజకీయ జేఏసీ ఈ నెల14న తలపెట్టిన “చలో అసెంబ్లీ” కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ.. తెరాస ఎమ్మెల్యేలు శాసనసభలోని ముఖ్యమంత్రి చాంబర్ ముందు బైటాయించి నినాదాలు చేస్తున్నారు. ఇది గమనించిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆగ్రహంతో ”నాటకాలొద్దు చాంబర్ లోపలకు రండి మాట్లాడుకుందాం” అంటూ తన ఛాంబర్ లోనికి వెళ్లిపోయారు.

అయితే, ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై తెరాస తీవ్రంగా మండిపడింది. అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలను సీఎం కిరణ్ అవమానపరుస్తున్నారని తీరాస ఎమ్మెల్యేలు హరీష్రావు, ఈటెల రాజేంద్ర ఆరోపించారు. రైతు సమస్యలపై సీఎం చాంబర్ వద్ద ధర్నా చేస్తున్నా.. తమకు కనీసం గౌరవం కూడా ఇవ్వటం లేదని, రాష్ట్ర చరిత్రలో ఇలాంటి సీఎంను ఎన్నడూ చూడలేదని తెరాస ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. ఓ ప్రాంత రైతులకు అన్యాయం చేస్తూ సీఎం డ్రామాలాడుతున్నారని తెరాస నేత హరీష్రావు ఎద్దేవా చేశారు.

Exit mobile version