పవన్ కల్యాణ్ అడుగు జాడల్లో మిగిలిన మెగా హీరోలూ నడుస్తున్నారు. ఉత్తరాఖండ్ వరద బాధితుల సహాయార్థం పవన్ కల్యాణ్ రూ.20 లక్షల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రామ్చరణ్, అల్లు అర్జున్ కూడా పవన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందడుగు వేశారు. చెరో పది లక్షల రూపాయల సహాయం ప్రకటించారు. సోమవారం రాత్రి హైదరాబాద్లోని శిల్పకళావేదికలో జరిగిన ఎవడు ఆడియో వేడుకలో ఈ మెగా హీరోలిద్దరూ తన ఉదారతను చాటుకొన్నారు. ఈ రూ.20 లక్షల సహాయాన్ని చెక్కు రూపంలో చిరంజీవికి అందించారు. చిరు.. ఈ మొత్తాన్ని ప్రధాన మంత్రి సహాయ నిధికి అందజేస్తానని సభాముఖంగా చెప్పారు. మిగిలిన కథానాయకులు కూడా ముందుకొస్తే… ఉత్తరాఖండ్ బాధితులకు చేయూతనిచ్చినట్టవుతుంది.