ఎవడు సినిమాలో అల్లు అర్జున్ పోలీస్గా కనిపిస్తున్నాడా? గత కొన్ని రోజులుగా వెబ్ ప్రపంచంలో ఈ వార్తే చక్కర్లు కొడుతోంది. తాజా సమాచారం ఏమిటంటే… బన్నీనేకాదు, ఆ సినిమాలో రామ్చరణ్ కూడా పోలీసేనట. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన చిత్రం ఎవడు. రామ్చరణ్తో శ్రుతిహాసన్, అమీ జాక్సన్క జత కట్టారు. ఈ సినిమాతో బన్నీ ఓ కీ రోల్ పోషిస్తున్నాడు. ఇందులో బావా బామ్మర్దులు ఇద్దరూ పోలీస్లేనట. ఓ కేసుని ఛేదించే క్రమంలో బన్నీ ప్రాణాలు కోల్పోతాడట. బన్నీ మెదడు… చరణ్ కి ఫిష్ట్ చేస్తారట. ఆ తరవాత ఏమైంది? అనేదే ఈ సినిమా కథ. హాలీవుడ్ సినిమా ఫేస్ ఆఫ్ తరహాలో సాగే సినిమా ఇది. ఈ యాక్షన్ థ్రిల్లర్ ఏమాత్రం రక్తికట్టిస్తుందో చూడాలి. ఈనెల 30న పాటల్ని విడుదల చేస్తారు. వచ్చే నెలలో సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.