ఆయన్ని మరో జైలుకు మార్చండి : సీబీఐ

vijayasai-reddyజగన్ అక్రమాస్తుల కేసులో కీలక నిందితుడు ఆడిటర్ విజయసాయి రెడ్డిని చంచల్గూడ జైలు నుంచి మరో జైలుకు తరలించాలని సిబిఐ ప్రత్యేక కోర్టులో సీబీఐ మెమో దాఖలు చేసింది. వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, విజయ సాయి రెడ్డిలు ఒకే జైలులో ఉన్నట్లయితే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలుంటాయని సీబీఐ మెమోలుల్ పేర్కొంది. అయితే, సీబీఐ పిటిషన్ పై న్యాయస్థానం విచారణను సోమవారానికి వాయిదా వేసింది. కాగా, విజయసాయి రెడ్డి,  జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.