బాబుకు తెలంగాణ సెగలు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన వస్తున్నా.. మీకోసం పాదయాత్ర తెలంగాణ ప్రాంతంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా బాబు పాదయాత్ర ఈ రోజు నిజామాబాద్ లో జరుగుతోంది. పాదయాత్ర సందర్భంగా బాబు మాట్లాడుతూ టీడీపీ 2014లో అధికారంలోకి వచ్చాక ఎల్ కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని హామీ ఇచ్చారు. అవినీతిపై టీఆర్ఎస్ ఏరోజూ మాట్లాడలేదన్నారు. కాగా నిజామాబాద్ జిల్లాలో బాబు పాదయాత్రకు తెలంగాణ వాదుల నిరసన సెగలు తాకాయి. బాబు గో బ్యాక్ అంటూ నినాదాలతో చంద్రబాబును పిట్లం మండలం, రామాపురంలో తెలంగాణ వాదులు అడ్డుకున్నారు. 15 మందిని పోలీసులు పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అదుపులోకి తీసుకున్నారు.