కేంద్ర కేబినెట్ అత్యవసర భేటీ !

Cabinet-Meetingవరదల బీభత్సంతో ఉత్తరాఖండ్ అతలాకుతలమయింది. వరదల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు పంపడానికే సుమారు వారం సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆదివారం నుంచి ఉత్తరాఖండ్ లో  భారీ వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ కార్యదర్శి నేతృత్వంలో ఈరోజు (శనివారం) ఉదయం న్యూఢిల్లీలో అత్యవసరం సమావేశమైంది. ఆర్మీ, వాయుసేన, ఐటీబీ, బీఆర్ఓ విభాగాలకు చెందిన అత్యున్నత అధికారులు ఆ సమావేశంలో పాల్గొన్నారు.