నేతలకు బాబు దిశానిర్దేశం!

cbnస్థానిక సంస్థల ఎన్నికలకు నేతలను సన్నద్ధం చేయడంలో తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. 2014 సార్వత్రిక ఎన్నికలకు ఫ్రీ ఫైనల్ గా భావించే స్థానిక సంస్థలు, పురపాలక ఎన్నికల కోసం బాబు నేతలకు ఇప్పటినుంచే దిశానిర్దేశం చేస్తున్నారు. ఇందుకోసం పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమావేశాలను నిర్వహిస్తూ.. స్థానికంగా నేతలకు ఎదురవుతున్న సమస్యలు.. తదితర అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఈరోజు ఎన్టీఆర్ భవన్ లో ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్, జహీరాబాద్, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ మరియు భువనగిరి పార్లమెంటరీ స్థానాల నేతలతో బాబు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలల్లో బాబు ప్రత్యేకంగా.. “గడప గడపకు తెలుగుదేశం” కార్యక్రమాన్ని
విస్తృతంగా నిర్వహించాలని నేతలకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. తన సుదీర్ఘమైన “వస్తున్నా.. మీకోసం” పాదయాత్ర ద్వారా తెలుగు తమ్ముళ్లలో నూతన ఉత్సాహాన్ని నింపిన బాబు.. ఇప్పుడు నియోజకవర్గాల నేతలకు దిశానిర్దేశం చేయడం పాటుగా, స్థానికంగా నెలకొన్న సమీకరణాలపై ఓ అంచనాకు వచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.