బన్సల్‌ కు సమన్లు !

bansal-resignsరైల్వేశాఖ మాజీ మంత్రి పవన్‌ కుమార్‌ బన్సల్‌ ను సీబీఐ సమన్లు జారీచేసింది. ఈరోజు విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించింది. రైల్వేశాఖలో ముడుపుల కేసు సంబంధించి  బన్సల్‌ను సీబీఐ విచారించనుంది. రైల్వే బోర్టు నియామకాలకు సంబంధించి బన్సాల్‌ దగ్గరి బంధువు ఒకరు అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో..  అతన్ని అరెస్టు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే బన్సల్‌ మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.