Site icon TeluguMirchi.com

ఉత్తారఖండ్ లో లోయలో పడిన బస్సు

bus-accidentఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు లోయలో పడిపోవటంతో.. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 15 మంది తీవ్ర గాయాలపాలైనట్లు తెలుస్తోంది. అల్మోర జిల్లాలోని దూల్ చినా ప్రాంతంలో కొండ చరియ విరిగిపడటంతో బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. హుటాహుటినా సంఘటన ప్రాంతానికి చేరుకున్నఅధికారులు సహాయకచర్యలను చేపట్టారు. గాయపడిన వారిని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. కాగా, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వరదల కారణంగా చిక్కుకుపోయిన రాష్ట్రవాసుల సంబంధీకులకు సమాచారం అందించేందుకు రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేశారు. బాధితులకు సంబంధించిన సమాచారం కోసం 8978466886, 040-23237417 నంబర్లకు కాల్ చేయవచ్చని కలెక్టరు వెల్లడించారు.

Exit mobile version