దూకుడు కాంబినేషన్ లో సినిమా మళ్లీ మొదలుకానుంది. మహేష్బాబు – శ్రీనువైట్ల మ్యాజిక్ కాంబినేషన్లో వస్తున్న ఆగడు పై ఎన్నో అంచనాలున్నాయి. ఈ సినిమా ఆగస్టులో ప్రారంభం కావాలి. అయితే.. కాస్త వెనక్కి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. కారణం.. ‘వన్’. ఎందుకంటే ముందు అనుకొన్న ప్రకారం సుకుమార్ సినిమా ఆగస్టు నాటికి పూర్తవ్వాలి. కానీ ఇంకా ఆ సినిమా చిత్రీకరణ దశలోనే ఉంది. ఎంత వేగంగా ఆ సినిమాని కంప్లీట్ చేసినా ఆగస్టులో పూర్తి చేయడం కష్టం. అందుకే ఆగడు వాయిదా పడే అవకాశాలున్నాయి. ఈ చిత్రంలో మహేష్బాబు సరసన తమన్నానటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నారు. సంగీత దర్శుడిగా తమన్కి ఇది 50వ సినిమా. ప్రస్తుతం ఊటీలో స్ర్కిప్టు పనులు జరుగుతున్నాయి.