Site icon TeluguMirchi.com

ఆ జెండా లో అన్ని కాంగ్రెస్ పధకాలే !

botsaవిజయవాడ పర్యటనలోఉన్న పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ .. బలహీన వర్గాల కోసం వేలాది కోట్ల రూపాయాలు బడ్జెట్ లో కేటాయించిన ప్రభుత్వం తమదని, ప్రాంతాల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ, ప్రత్యేక రాష్ట్రం కోరుతున్నప్పటికీ, అభివృద్ధి ఆగలేదని తెలిపారు. వైకాపా జెండాలో అన్ని కాంగ్రెస్ పధకాలేనని, వైఎస్సార్ సీపీ కనీసం పేరుకూడా చెప్పుకోలేని స్థితిలో ఉందని అన్నారు. జగన్ ను ఉద్దేశించి హత్య చేసిన వారికంటే ఆర్ధిక నేరాలకు పాల్పడ్డ వారే ప్రమాదకరమన్నారు. ప్రత్యేక రాష్ట్రం భావోద్వేగంతో ఏర్పడి వ్యాపారం చేస్తున్న పార్టీలొ ఒకరిద్దరు ఎంపీలు చేరారని, కేకే, వివేక్, మందాలనుద్దేశించి అన్నారు.

Exit mobile version