రాష్ర్ట విభజన సున్నితమైన సమస్య : బొత్స

రాష్ర్టా విభజన సున్నితమైన సమస్య… దీనికి సత్వరమే పరిష్కారం చూపించాలని కేంద్రాన్ని కోరతామని పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ వెల్లడించారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర విభజన సమస్య గొడ్డలిపెట్టుగా మారిందన్నారు. ఎల్బీ స్టేడియంలో ప్రారంభమైన కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో బొత్స ప్రారంభోపన్యాసం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలకు దిశానిర్దేశం చేయడానికే ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టబద్ధత కోసం డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. ఎఫ్ డీఐల వల్ల రైతులకు మేలు జరుగుతుందని ఆయన అన్నారు. అక్రమంగా సంపాదించిన సొమ్ముతో పార్టీ పెట్టారని పరోక్షంగా జగన్ పై విమర్శలు గుప్పించారు. రాజకీయాలతో అధికార దుర్వినియోగం చేసి వ్యాపార లబ్ధి పొందారని ఆరోపించారు.