Site icon TeluguMirchi.com

పీసీసీ ఛీఫ్ ఢిల్లీ టూర్..!

botsaతెలంగాణ విషయాన్ని త్వరలో తేల్చే దిశగా కాంగ్రెస్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పటికే హస్తినా చేరుకొని అధిష్టాన పెద్దలతో సమావేశమవుతూ.. బిజిబిజీగా గడుపుతున్నాడు. తాజాగా, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ కూడా ఈరోజు (బుధవారం) ఉదయం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రాష్ట్రంలోని తాజా పరిణామాలపై పార్టీ నేతలకు బొత్స నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం. మరోవైపు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ఈనెల 29న రాష్ట్రానికి రానున్న విషయం తెలిసిందే.

Exit mobile version