ఎన్టీఆర్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం రామయ్యా వస్తావయ్యా. సమంత, శ్రుతిహాసన్ కథానాయికలు. గబ్బర్ సింగ్ తో సూపర్ హిట్ ఇచ్చిన… హరీష్ శంకర్ దర్శకుడు. ఈ చిత్రంలో ప్రధాన ప్రతినాయకుడిగా బొమ్మాళీ… రవి శంకర్ కనిపించనున్నారు. ఢమరుకంతో విలనీ వేషాలకు దిగాడు ఈ డబ్బింగ్ ఆర్టిస్ట్. అంతకు ముందు చిన్నా చితకా సినిమాలలో నటించిన పెద్ద హీరోలతో ఢీ కొట్టడం ఢమరుకంతోనే మొదలు. ఇప్పుడు ఎన్టీఆర్తోనూ సై అంటున్నాడు. ఈ సినిమాతో ఎన్టీఆర్ విద్యార్థి నాయకుడిగా కనిపిస్తాడట. ఎన్టీఆర్-రవిశంకర్ల మధ్య నడిచే సన్నివేశాలు ఆద్యంతం రక్తికట్టిస్తాయి… అని దర్శకుడు చెబుతున్నాడు.