వాయవ్య పాకిస్థాన్ లోని పెషావర్లో జరిగిన బాంబు పేలుడులో 17 మంది మృతి చెందారు. 20 మంది గాయపడ్డారు. కోహత్ జిల్లా నుంచి పెషావర్ నగరానికి భద్రతాబలగాల కాన్వాయ్ వెళుతుండగా పెషావర్లోని బాదాబెర్ ప్రాంతంలో అత్యంత రద్దీ ఉండే మార్కెట్ లో కారులో అమర్చిన బాంబును రిమోట్ కంట్రోల్ తో తీవ్రవాదులు బాంబు పేల్చారు. ఈ ఘటనలో పది వాహనాలు, పలు దుకాణాలు కూడా ధ్వంసమయ్యాయి.