ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో అరెస్టయిన వారిలో అయిదుగురికి న్యాయస్థానం ఈరోజు (మంగళవారం) బెయిల్ ను మంజూరు చేసింది. గురనాథ్, విందూ ధారాసింగ్ లతో పాటుగా, మరో ముగ్గురు బుకీలకు ముంబయి కోర్టు బెయిల్ ను మంజూరు చేసింది. కాగా, ఈ వ్యవహారంలో.. బెయిల్ లభించిన ఐదుగురు కూడా రోజు విడిచి రోజు విచారణకు హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది.