Site icon TeluguMirchi.com

ఆస్ట్రేలియాలో భారతీయుడిపై దాడి !

Australians attack Indiansఆస్ట్రేలియాలో భారతీయులపై జాత్యహంకార దాడుల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా, మెల్ బోర్న్ సమీపంలోని బలారత్ నగరంలో రెస్టారెంట్ నడుపుతున్న హిమంశు గోయల్ (22) అనే భారతీయుడిని 8 మంది టీనేజర్లు జాత్యహంకారంతో దూషించారు. మరో బృందం అతడిపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే,
సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హిమంశు గోయల్ ను బలారత్ నగర మేయర్ జాన్ బర్ట్ పరామర్శించారు. గతంలో చైనా దేశీయులే ప్రధానంగా దాడులు జరిగేవి.
అయితే, కొన్ని సందర్భాల్లో భారతీయులు కూడా ఈ దాడులబారిన పడిన సందర్భాలున్నాయి. క్రమంగా వీటి సంఖ్యపెరిగిపోవడంతో ఆస్ట్రేలియాలో చదువుకునే భారతీయుల విద్యార్ధుల సంఖ్యపడిపోతూ వస్తోంది. కాగా, గత రెండు సంవత్సాల నుండి ఆస్ట్రేలియాలో భారతీయులపై తరచుగా జాత్యహంకార దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే.

Exit mobile version