Site icon TeluguMirchi.com

10 నుంచి అసెంబ్లీ సమావేశాలు

assembly-meetingsఈనెల 10వ తేదీ నుంచి 21 తేదీ వరకు రాష్ట్ర శాసనసభ మలివిడత బడ్జెట్ సమావేశాలను నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు. నెల్లూరు నగరంలోని పరమేశ్వరీ అమ్మవారిని
దర్శించుకున్న ఆనంతరం ఆనం మీడియాకు మాట్లాడుతూ.. ఈ సమావేశాల్లోనే రాష్ట్ర బడ్జెట్ ను సభ్యులు ఆమోదించనున్నట్లు చెప్పారు. అయితే, బుతుపవణాల రాకతో.. రాష్ట్రంలో వర్షాలు కురుస్తుంటే.. అసెంబ్లీలో రాజకీయ నాయకుల తిట్ల వర్షం కూడా కురవబోతుందన్నమాట!

Exit mobile version