Site icon TeluguMirchi.com

ఉత్తరాఖండ్ కు రాష్ట్ర మంత్రులు !

uttarakhand-floodఉత్తరాఖండ్‌ లో వరద ముంపుకు గురైన ప్రాంతాలకు రాష్ట్రమంత్రుల బృందం వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే ప్రయత్నాలను ప్రారంభించిన విషయం తెలిసిందే.అయితే,  రాష్ట్రానికి చెందిన వరద బాధితులకు సహాయం అందించడానికి మంత్రులు శ్రీధర్‌బాబు, రఘువీరా, దానం నాగేందర్ లు ఉత్తరాఖండ్‌కు వెళ్లనున్నట్లు సమాచారం. స్వయంగా సహాక చర్యలను పర్యవేక్షించి వరదల్లో చిక్కుకున్న తెలుగువారిని త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీరు ఉత్తరాఖండ్ పర్యటనను చేపట్టనున్నట్లుతెలుస్తోంది.

Exit mobile version