Site icon TeluguMirchi.com

హైదరాబాద్ చేరుకున్న డిగ్గీ రాజా !

digvijaysigఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత దిగ్విజయ్ సింగ్ తొలిసారిగా హైదరాబాద్ వచ్చారు. ఆయన సోమవారం ఉదయం విశాఖ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు పలువురు నేతలు ఘన స్వాగతం పలికారు. నగరంలో ఈ రోజు దిగ్విజయ్‌సింగ్ బిజీబిజీగా గడుపనున్నారు. గాంధీభవన్‌లో పలువురు నేతలతో ఆయన సమావేశం కానున్నారు. ముఖ్యంగా తెలంగాణ అంశానికి సంబంధించి చర్చలు జరపనున్నట్లు సమాచారం. ఉదయం 10:30 గంటలకు పీసీసీ కార్యవర్గసభ్యులతో, మధ్యాహ్నం 12 గంటలకు సీమాంధ్ర నేతలతో, 2:30 గంటలకు తెలంగాణ నేతలతో, 3 గంటలకు పీసీసీ సమన్వయ కమిటీతో దిగ్విజయ్‌సింగ్ భేటీ కానున్నారు.

Exit mobile version