లభ్యం కాని 430మంది తెలుగువారి ఆచూకీ !

char-dham-vitimsచార్ ధామ్ యాత్రకు వెళ్లిన వారిలో ఇంకా 430మంది తెలుగువారి ఆచూకీ లభ్యం కాలేదు. ఆంధ్ర ప్రదేశ్ నుంచి చార్ ధామ్ వెళ్లిన యాత్రికుల వివరాలను ప్రభుత్వం ఈరోజు (బుధవారం) ప్రకటించింది. మొత్తం 2,616 మంది తెలుగువారు యాత్రకు వెళ్లారని, ఇప్పటివరకూ 1239 మంది క్షేమంగా తిరిగి వచ్చారని సహాయ పునరావాస కమిషనర్ రాధ వెల్లడించారు. 993మంది క్షేమంగా ఉండి తిరుగు ప్రయాణంలో ఉన్నట్లు తెలిపారు. కాగా 430మంది తెలుగువారి ఆచూకీ ఇప్పటికి తెలియలేదని రాధ పేర్కొన్నారు.