Site icon TeluguMirchi.com

హైకోర్టులో హాజరైన ‘ఆర్ కె’

Vemuri-Radhakrishnaఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ ఈరోజు (బుధవారం) హైకోర్టుకు హాజరయ్యారు. గుంటూరు జిల్లాలో ఇసుక తవ్వకాలపై హైకోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకున్నా, ఇసుక తవ్వకాలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
ఇచ్చిందని.. దీని ఆధారంగా అధికారులు అనుమతులు మంజురూ చేస్తున్నట్లు ఆంధ్రజ్యోతి వార్త పత్రికలో ఒక కథనం ప్రచురించింది. అయితే, తామెలాంటి అనుమతులు ఇవ్వలేదని అధికారులు గతంలో హైకోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే. దీంతో సుమోటో కింద హైకోర్టు దీనిపై విచారణ జరుపుతోంది.
విచారణలో భాగంగా రాథాకృష్ణ ఈరోజు హైకోర్టులో హాజరైనట్టు తెలుస్తోంది.

Exit mobile version