అమ్మ చెబితేనే…!

cm-kiran-review-on-power-cuధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి రాజీనామాల ఆమోదంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. తమకు మంత్రి పదవులు ఇవ్వాలంటూ పలువురు సీనియర్ పాలక పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటికే కిరణ్ పై వత్తిడి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ రోజు పార్టీ కీలక సమావేశం  రాత్రి 7:30గంటలకు గాంధీభవన్‌లో జరగనుంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, రాష్ట్ర మంత్రులు, సీనియర్‌ నేతలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. మరో వైపు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈనెల 29 సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. మరుసటి రోజు ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షతన జరిగే అధికారిక కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అదేరోజు సాయంత్రం ఆయన అధిష్టాన పెద్దలను కలవనున్నారు. 31న సోనియా గాంధీని కలిసే అవకాశముంది. అయితే అధినేత్రిని కలిసిన తర్వాత మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై సీఎం నిర్ణయం ఉంటుందని తెలుస్తోంది.