Site icon TeluguMirchi.com

అమ్మ ఆదేశం..!

soniaఉత్తరాఖండ్ లో ప్రకృతి బీభత్సాన్ని చూసి చలించిపోయారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. వరదలతో.. అతాలకుతలమైన ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని పునర్మించాలంటే దాదాపుగా నాలుగైదు సంవత్సరాలు పట్టనున్నట్లు ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పేర్కొన్నారు.  ఈ నేపథ్యంలో..  కేంద్ర, రాష్ట్రాల నుంచి సహాయ, పునరావాస కార్యక్రమాలను ప్రకటించినా.. అది బాధితులకు సరిపోదని గ్రహించిన అధినేత్రి కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ నెల జీతాన్ని విరాళంగా ఇవ్వాలని ఆదేశించారు. అంతేకాకుండా ఎంపీలంతా తమ నియోజకవర్గ అభివృద్ధి నిధులనుంచి పదేసి లక్షల చొప్పున కేటాయించాలని ఆమె కోరారు. అపారమైన నష్టాన్ని పూడ్చాలంటే.. అమ్మ ఆ మాత్రం చేయాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మొత్తానికి సోనియా తీసుకున్న నిర్ణయానికి అందరూ హర్షం
వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.

Exit mobile version