అమర్ నాథ్ యాత్ర ప్రారంభం

amarnadh-yaatra-startedఅమర్ నాథ్ యాత్ర ఈ రోజు (గురువారం) ఘనంగా ప్రారంభమైంది. మూడు వేల మందికిపైగా యాత్రీకులతో తొలి బృందం నేడు అమర్ నాథ్ యాత్ర ప్రారంభించింది. దక్షిణ కాశ్మీర్ నుంచి పటిష్ఘమైన భద్రత మధ్య ఈ బృందం యాత్రను ప్రారంభించింది. ఈ బృందంలో 563 మంది మహిళలు, 37 బాలలు ఉన్నారని అధికారులు తెలిపారు. జమ్మూ బేస్ క్యాంప్ నుంచి ఆరాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి జీఏ మీర్ జెండాఊపి యాత్రను ప్రారంభించారు.