తివారి స్థానంలో అంబటి రాయుడు ఎంపిక

ఆంధ్ర క్రికెటర్ అంబటి రాయుడు ఎదురు చూపులు ఫలించాయి. ఐ.పీ.ఎల్‌ మ్యాచ్ ల్లో  సత్తా చాటిన అంబటి రాయుడికి జాతీయ జట్టులో తొలిసారి స్థానం లభించింది. గాయపడిన మనోజ్ తివారీ స్థానంలో రాయుడికి ఈ అవకాశం లభించింది. ప్రస్తుతం రాయుడు బరోడాకు ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ రంజీ సీజన్లో ఇప్పటికే ఆరు మ్యాచ్ లు ఆడిన రాయుడు ఓ సెంచరీతో పాటు నాలుగు అర్థ సెంచరీలు చేశాడు. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కు ఆడిన రాయుడు టీ20ల్లోనూ తన సత్తా చాటాడు.