Site icon TeluguMirchi.com

మద్య నియంత్రణ కమిటీ సదస్సు ప్రారంభం

Alcohol-contrlo-confrenceకొద్దిసేపటి క్రితం రవీంద్రభారతిలో “మద్య నియంత్రణ కమిటీ రాష్ట్ర సదస్సు” ప్రారంభమైంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకిమాధవరావు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి వివిధ పార్టీల
ప్రతినిధులు హాజరయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, తెరాస సీనియర్ నేత నాయిని నర్సింహులు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ.. తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యంగా రాష్ట్రంలో మద్య నియంత్రణకు
చేపట్టవలసిన అంశాల గురించి చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Exit mobile version