మా అజెండాలో అఖిల పక్షంపై చర్చ లేదు : బొత్స

పిసిసి చీఫ్ బొత్స పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేసేందుకే ఎర్పాటు చేస్తున్నామన్నారు. పలువురు మంత్రులతో కలిసి భద్రతా ఎర్పాట్లపై పోలీసు ఉన్నతాధికారులతో ఈనెల 16 ఎల్‌బి స్టేడియంలో నిర్వహిస్తున్న సదస్సు ఏర్పాట్లపై సమీక్షించారు. ఈనెల 28న ఢిల్లీలో రాష్ట్ర విభజన అంశంపై అఖిల పక్ష భేటి జరుగుతున్నందున ఆ అంశాన్ని పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశంలో చర్చించడం సరికాదన్నారు. మీటింగ్‌ ప్రధాన అజెండా ‘పార్టీ బలోపేతానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం… కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే’ అన్నారు బొత్స. పార్టీ మాజీ ప్రజా ప్రతినిధులు, మండలస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు వివిధ పదవుల్లో ఉన్న కాంగ్రెస్ నేతలు సుమారు 10వేల మంది ఈ సమావేశానికి పాల్గొంటారన్నారు.