తెలంగాణ రాజకీయ జేఏసీ ఈ నెల 14 తలపెట్టిన “ ఛలో అసెంబ్లీ”కి తమకు ఆహ్వానం అందలేదని తెలంగాణ తెదేపా ఫోరం నేతలు స్పష్టం చేశారు. “ఛలో అసెంబ్లీ”కి మద్ధతు తెలపవల్సిందిగా తమను ఎవరూ కోరలేదని తెదేపా తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. టీ-జేఏసీ తలపెట్టిన ఈ కార్యక్రమంపై ఏం చేయాలో రేపు (బుధవారం) టీడీపీ తెలంగాణ ఫోరం సమావేశమయి నిర్ణయిస్తుందని తెలిపారు. అయితే, స్టీల్ఫ్లాంట్ బయ్యారంలోనే ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. “బయ్యారం ఉక్కు.. గిరిజనుల హక్కు” అని ఎర్రబెల్లి
పేర్కొన్నారు.