పార్టీలో పెరుగుతున్న మోడీ ప్రాబల్యం కారణంగా ఇక తన మాటలు చెల్లుబాటు కావని అద్వానీ ఒక నిర్ణయానికి వచ్చేసినట్లు కనిపిస్తోంది. పార్టీలో మోడీ చాపక్రింద నీరులా విస్తరిస్తున్నారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో సాధించిన విజయాలు మోడీ వర్గానికి మరింత బలానిచ్చాయి. ఇక ఇలాంటి పరిస్థితుల్లో అద్వానీ సమావేశానికి హాజరైన మోడీ వర్గపు గానాబజానా వింటూ కూర్చోవాలి తప్ప, పార్టీకి చేసే దిశానిర్దేశాలేమి ఉండవు. అందువల్లే ఏదో ఒక సాకుతో అద్వానీ ఈ సమావేశాలకు దూరంగా ఉండిపోయినట్లు రాజకీయవర్గాల బోగట్ట. అయితే, ఎన్నికలు దగ్గరపడుతుండటంతో.. అద్వానీ లాంటి అగ్రనేతల అలక భాజపాకు చేటు చేసే అంశమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.