నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం సోమశిలలో ఇరువర్గాల మధ్య నెలకొన్న భూవివాదం కాస్తా ఘర్షణకు దారితీసింది.దాంతో ఇరువర్గాలు రాళ్లతో దాడి చేసుకున్నాయి. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దింతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపధ్యంలో పోలీసులు సోమశిలలో 144వ సెక్షన్ విధించారు. పరిస్థితి అదుపులోకి వచ్చేవరకు 144వ సెక్షన్ కొనసాగనుంది.