వరదలతో తీవ్రంగా నష్టపోయిన ఉత్తరాఖండ్ రాష్ట్రానికి 1000 కోట్ల రూపాయల ఆర్ధిక సహాయాన్ని కేంద్రం ప్రకటించింది. వరదలతో తీవ్రంగా నష్టపోయిన ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని ఆదుకునేందుకు ఈ రోజు ప్రధాని నివాసంలో ఉన్నతస్థాయి కమిటీ భేటీ అయింది. అలాగే ఆ రాష్ట్రంలో వరదల్లో చనిపోయిన ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయలు ఇస్తున్నట్లు మన్మోహన్ సింగ్ ప్రకటన చేశారు.