Site icon TeluguMirchi.com

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు షురూ !

pollజడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. సీమాంధ్రలోని 1,093 జడ్పీటీసీ స్థానాలకు, 16,214 ఎంపీటీసీ స్థానాలకు ఓట్ల లెక్కింపు జరగనుంది. పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం 2,099 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దాదాపు 15వేల మంది సిబ్బందిని ఓట్ల లెక్కింపు కోసం వినియోగిస్తున్నారు. తెలంగాణలోని 441 జడ్పీటీసీ స్థానాలకు, 6,480 ఎంపీటీసీ స్థానాలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. రాత్రి 9గంటల కల్లా పూర్తి ఫలితాలు వెలువడే అవకాశముంది.

Exit mobile version