Site icon TeluguMirchi.com

వైకాపాకు కాకినాడ కన్వీనర్ రాజీనామా..!

ysrcpతూర్పుగోదావరి జిల్లాలో వైకాపా నేతల మధ్య అంతర్గత విభేదాలు బట్టబయలయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో వైకాపా కు ఎదురుదెబ్బ తగిలింది. కాకినాడ నియోజకవర్గానికి కన్వీనర్ గా వ్యవహరిస్తున్న జాన్ ప్రభుకుమార్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయనతో పాటు వైఎస్ ఆర్ కాంగ్రెస్ చెందిన మరో 9 మంది ఈ రోజు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. అయితే నియోజవర్గాల వారీగా వైకాపా కన్వీనర్లను నియమించడంతో.. స్థానిక నేతల మధ్య అంతర్గత కలహాలకు తెరలేపినట్లుయిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో.. వైకాపాలో నేతల మధ్య విభేదాలు తలెత్తడం ఆ పార్టీకి పెద్ద దెబ్బేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version