1976 నుంచి వైఎస్ తో ఆయనకు సాన్నిహిత్యం ఉంది. కేవీపీతో పాటు వైఎస్ కి ఆయన ఆప్తమిత్రుడిగా ఉన్నారు. ఆయనే కృష్ణా జిల్లాలోని హనుమాన్ జంక్షన్కు చెందిన డాక్టర్ దుట్టా రామచంద్రరావు. వైఎస్సార్ 70వ జయంతి సందర్భంగా వైఎస్ తో ఆయనకు ఉన్న స్నేహానికి గుర్తుగా వైఎస్ సతీమణి విజయమ్మ ఓ అరుదైన బహుమతి ని దుట్టాకి పంపారు.
వైఎస్సార్ జ్ఞాపకంగా ఆయన ధరించిన దుస్తులను బహుమతిగా అందజేశారు విజయమ్మ. వైఎస్సార్ 70వ జయంతి సందర్భంగా ప్రాణమిత్రుడు వేసుకున్న వస్త్రాలను తన చేతితో తడుముతూ దుట్టా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. వైఎస్సార్ ఉన్నంతకాలం తమ స్నేహానికి ఎంతో విలువ ఇచ్చారని, ఆయన మరణానంతరం కూడా ఆ కుటుంబం తనకు ఎంతో గౌరవాన్ని ఇస్తోందని దుట్టా గుర్తు చేసుకున్నారు. ప్రస్థుతం దుట్టా వైఎస్సార్సీపీ పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ సభ్యుడుగా ఉన్నారు.