వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ఎమ్మెల్యేలతో కలసి ఈ ఉదయం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ అయ్యారు. రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచాలని కోరుతూ.. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి జగన్ బృందం వినతిపత్రాన్ని అందజేసింది. కాగా, శీతాకాల విడిదిలో వున్న రాష్ట్రపతికి పలువురు రాజకీయ నేతల నుంచి విన్నపాలు వెలువెత్తుతున్నాయి. అజారుద్దీన్, కేంద్రమంత్రి పురంధేశ్వరి మరికాసేపట్లో రాష్ట్రపతిని కలవనున్నారు. తెరాస అధినేత కేసీఆర్ ఈరోజు రాత్రి ఎనిమిది గంటల సమయంలో ప్రణబ్ తో భేటీకానున్నారు.