Site icon TeluguMirchi.com

ప్రపంచ పర్యాటక సదస్సు ప్రారంభం

chiruప్రపంచ పర్యాటక సదస్సు హైదరాబాద్ లో శుక్రవారం ప్రారంభమైంది. హైదరాబాద్
లోని పార్క్ హయాత్ హోటల్ లో ఈ సదస్సును ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ప్రారంభించారు. ఈ సదస్సులో 29 దేశాల నుంచి 300 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సంధర్భంగా ముఖ్యమంత్రి కిరణ్ మాట్లాడుతూ… ఆంద్ర ప్రదేశ్ లోని పర్యాటక ప్రాంతాలు విదేశీయులను అమితంగా ఆకర్షిస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో తిరుపతి, వరంగల్ లోనూ అంతర్జాతీయ సదస్సుల నిర్వహణకు ఏర్పాటు చేస్తున్నట్లు సీ ఎం వెల్లడించారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి మాట్లాడుతూ దేశంలో పర్యాటక రంగం అభివృద్ధి తో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు. నగరంలో ప్రపంచ పర్యాటక సదస్సు నిర్వహణకు అవకాశం ఇచ్చిన అందరికీ ఈ సంధర్భంగా కృతఙ్ఞతలు తెలియజేశారు. ప్రపంచ పర్యాటక సదస్సు నగరంలో మూడు రోజుల పాటు జరగనుంది.

Exit mobile version