మహిళా ఎమ్మెల్యేల మాటల యుద్ధం!

roja
తెదేపా-వైకాపా ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధానికి తెరలేచింది. నేడు అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద వైకాపా ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. స్పీకర్‌ పక్షపాతి ధోరణీతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మహిళా సంక్షేమ కాదు.. మహిళ సంక్షోభం విధంగా విధంగా నేతల తీరు ఉందని ఆమె ఘాటుగా విమర్శించారు.

రోజా ఆరోపణలను తెదేపా మహిళా ఎమ్మెల్యేలు ధీటుగా స్పందించారు. మహిళలపై మొసలీ కన్నీరు కారుస్తూ వైఎస్ఆర్‌సీపీ సభాసమయాలను వృథా చేస్తున్నారని ఎమ్మెల్యేలు అనిత, యామిని ధ్వజమెత్తారు. మహిళల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెదేపా మహిళా ఎమ్మెల్యేలు రోజాకు చురకలు అంటించారు