మంత్రి పదవులను వదులుకుంటారా..?

Gantaరాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి సమైక్యంద్ర్హా కు చెందిన మంత్రులు తమ ప్రయత్నాలను కొనసాగిస్తూనే వున్నారు. ఈరోజు ఉదయం కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు నివాసంలో సీమాంధ్ర మంత్రులు సమవేశమై దీనిపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి గంటా శ్రీనివాస రావు మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచడానికి..  అవసరమైతే మంత్రి పదవులను వదులకోవడం తోపాటు ఇతర అన్ని అవకాశాలను వాడుకోవాలని బావిస్తున్నామని అన్నారు. అయితే, మరోసారి సీమాంధ్ర మంత్రులు తమ చివరి ప్రయత్నంగా కేంద్ర మంత్రులు కావూరి, చిరంజీవులను అధినేత్రి సోనియా గాంధీ దగ్గరకు పంపే అవకాశం ఉందని.. ఏదేమైనా.. చివరి క్షణం వరకు తమ ప్రయత్నాలు కొనసాగిస్తామని మంత్రులు అంటున్నారు.