Site icon TeluguMirchi.com

రాజీనామా చేస్తాం..!

seemandraతెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా అధిష్టానం ముందడుగు వేస్తే రాజీనామాలు చేస్తామని సీమాంధ్ర నేతలు  హెచ్చరిస్తున్నారు. మూకుమ్మడి రాజీనామాలు చేస్తామన్న హెచ్చరిక ద్వారా కోర్ కమిటీపై తమ ప్రభావం చూపాలన్నది వారే ఉద్దేశంగా కనిపిస్తోంది. అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందని.. దానిని ముఖ్యమంత్రి,పిసిసి అధ్యక్షులకు తెలియచేశారని నేతలు అభిప్రాయపడుతున్నారు. అధిష్టానం హైదరాబాద్ ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా చేయాలన్న ప్రతిపాదనతో పాటుగా, తెలంగాణనా, రాయల తెలంగాణాన అన్న ప్రతిపాదనలపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. సీమాంధ్ర నేతలు కేంద్ర మంత్రి కావూరి నివాసంలో సమావేశమయి.. అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version