సీమాంధ్ర నేతలు ఎందుకు తమ స్వరాన్ని సమైక్యం నుంచి సపరేట్ కు మారుస్తున్నారు.. ? ఇక్కడే అసలు కథ దాగుంది. వాదం మార్చినవారంతా.. మేడమ్ సోనియా గాంధీతో మంతనాలు జరిపినవారే. అమ్మ ఆజ్ఞతో.. అలవోకగా ఆత్మగౌరవాన్ని తాకట్టుపెడుతున్నారు. అందుకు కిల్లి, కావూరి, పురంధేశ్వరి.. ఇలా ఇంకేందరు వచ్చి చేరుతారో.. ? చెప్పలేము. సరిగ్గా.. ఇదే విషయంపై ఇప్పుడు సీమాంధ్ర కాంగ్రెస్ నేతల్లో గుబులు మొదలైంది. అధిష్టానం గేమ్ ప్లాన్తో తమ వ్యూహం బెడసి కొడుతుందేమో అన్న ఆందోళన వారిని పట్టి పీడిస్తోంది. పైగా.. సీమాంధ్ర ప్రాంతం వారిని సంతృప్తి పర్చేలా తెలంగాణ బిల్లును తీసుకువస్తామని జీవోఎం సభ్యులు విశ్వాసం వ్యక్తం చేస్తుండటం వీరికి నిద్ర పట్టనివ్వడం లేదు. మరి తెలంగాణ బిల్లును అడ్డుకునేవారెందరో.. ? అధిష్టానం ఆజ్ఞతో టీ-బిల్లుకు హారతి పట్టేవారెందరో త్వరలోనే తేలనుందన్నమాట.. !