Site icon TeluguMirchi.com

కళంకిత మంత్రులపై రాష్ర్టపతిని కలుస్తాం : బాబు

Chandrababuరాష్ర్టంలోని అవినీతి మంత్రులపై ఈ నెల 22, 23 న రాష్ర్టపతిని కలిసేందుకు అనుమతి కోరుతున్నామని తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. కళంకిత మంత్రులను కాపాడటానికి సీఎం కిరణ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని బాబు ఆరోపించారు. రాజ్యాంగాన్ని రక్షించాల్సిన.. గవర్నర్ ఎలాంటి చర్యలూ.. తీసుకోవడం లేదని ఆయన విమర్శించారు. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ.. అవినీతికి వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేస్తున్న.. ఏకైక పార్టీ తెదేపానేని అన్నారు. ప్రజల సంపదను దోచుకొని హవాలా రూపంలో విదేశాలకు తరలించిన అవినీతిపరులను శిక్షించాలని ఈ సందర్భంగా బాబు డిమాండ్ చేశారు.

Exit mobile version