Site icon TeluguMirchi.com

గీతా రెడ్డి రాజీనామా… ?

geeta reddyజగన్ అక్రమాస్తుల కేసులో మరో మంత్రి బలైయ్యేటట్లు కనిపిస్తోంది. ఈ కేసులో సీబీఐ తాజాగా దాఖలు చేసిన ఛార్జ్ షీట్లలో మంత్రి గీతారెడ్డిని ఏ9 నిందితురాలిగా చేర్చింది. దీంతో.. ఈ కేసులో అవినీతి ఆరోపణలకు బలైన నాలుగో మంత్రిగా గీతారెడ్డి ఉండబోతుందన్న వార్తలు అప్పుడే గుప్పమన్నాయి. ఇప్పటికే ఈ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మోపిదేవి, ధర్మాన, సబితలు తమ మంత్రి పదవులకు సైతం రాజీనామాలు చేశారు. ఇప్పుడు లేపాక్షి హబ్ కేసులో తొమ్మిదో నిందితురాలిగా మంత్రి గీతారెడ్డి పేరును సిబిఐ చేర్చింది. ఈ నేపథ్యంలో.. రేపో, మాపో గీతా రెడ్డి కూడా తన మంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశాలున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జగన్ కేసులో ఇవే ఆఖరి ఛార్జ్ షీట్లని భావిస్తున్న నేపథ్యంలో.. ఈ కేసులో మంత్రులు బలికావడం ఇంతటితో ఆగినట్లేనేని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version