Site icon TeluguMirchi.com

బీజేపీ జాతకం తేలుస్తా! : యడ్యూరప్ప

Yeddyurappaకేజేపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కర్ణాటకలో జగదీశ్ శెట్టర్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం జాతకాన్ని జనవరి 4న తేలుస్తానని హెచ్చరించారు. కర్ణాటకలో బీజేపీ సర్కారు కొనసాగాలో లేదో జనవరి 4వ తేది రోజే నిర్ణయిస్తానని యడ్డీ వెల్లడించారు. బుధవారం ‘చలో విధాన సౌధ’కు పిలుపు నిచ్చిన యడ్డీ, అంతకుముందు ఫ్రీడం పార్కులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ… శెట్టర్ ప్రభుత్వం మెజారిటీ కోల్పోయిందని, అధికారంలో కొనసాగే నైతిక హక్కు ఆ పార్టీకి లేదని అన్నారు. ఈ విషయాన్ని తనంతట తానుగా శెట్టర్ గ్రహించాలని, లేనిపక్షంలో తామే స్వయంగా గవర్నర్ను కలిసి సర్కారుకు మద్దతు లేదని వివరిస్తామని హెచ్చరించారు.

Exit mobile version