సభ జరపాలనే నిర్ణయం దాదాపుగా ఖరారైనట్లే.. అయితే కేవలం సభనిర్వహిస్తే సరిపోదు. ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్లాలనే ఆలోచన వారిలో ఉంది. అందుకే ఈరోజు జేఏసీ విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో హైదరాబాద్ తో కూడిన తెలంగాణ ఏర్పాటు చేసే విధంగా కాంగ్రెస్ పై ఒత్తిడి తీసుకురావడం… తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వేగంవంతం చేసే విధంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లే విషయం చర్చించనున్నారు. ఇప్పటికే సద్భావన సదస్సుల పేరుతో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. మరి ముందుముందు ఇంకా ఎలాంటి కార్యక్రమాలతో ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్లాలన్నదానిపైనే చర్చించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఉద్యమాన్ని ఒక ప్రణాళికతో ముందుకు తీసుకువెళ్లిన ఉద్యమసారథి మరి ఇకముందు ఎలాంటి కార్యక్రమాలతో ముందుకు వెళతారో.