8% వృద్ధిరేటు సాధిస్తాం : ప్రధాని

Manmohan-Singh-woos-India-Iదేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ‘సీఐఐ’ సమావేశంలో ప్రధాని మన్మోహన్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. దేశ వృద్ది రేటు 5 శాతానికి తగ్గడం నిరాశ కలిగిస్తుందని అన్నారు. ఎగుమతుల తగ్గుదల, కరెంట్ ఖాతా లోటు పెరగడాన్ని అంగీకరించాల్సిన విషయమని ఆయన పేర్కొన్నారు. మళ్లీ 8 శాతం వృద్ధిరేటు సాధిస్తామని మన్మోహన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితుల వల్ల మనం తాత్కాలిక మందగమనాన్ని ఎదుర్కొవలసి వస్తోందని ప్రధాని వివరించారు. ద్రవ్యలోటు అధిగమించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ప్రధాని తెలియజేశారు.